సీనియర్ నటి ఖుష్భూ కాంగ్రెస్ పార్టీ తరపున రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఈరోజు ఎన్నికల ఫలితాల కోసం అందరితో పాటు ఆమె కూడా ఆతృతగా ఎదురు చూస్తుండగా… అనుకోకుండా అనారోగ్యంతో ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు ఖుష్బూ. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. “రేపు ఎన్నికల ఫలితాల సందర్భంగా నేను ఛానెల్స్లో కనపడటం లేదు. ఎందుకంటే హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. రేపు డ్రామాను మిస్ అవుతున్నాను. మనం ఏదైనా ప్లాన్ చేసుకుంటే ప్రకృతి దాన్ని పాడుచేస్తుంటుంది. చాలా డిసప్పాయింట్ అయ్యాను” అంటూ ట్వీట్ చేశారు కుష్భూ
previous post
next post