ఏడో విడత ఎన్నికలు ముగియడంతో పలు మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను డీఎంకే అధినేత స్టాలిన్ కొట్టిపారేశారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను నమ్మబోమని, మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడేవరకు వేచిచూస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఫలితాల అనంతరం ఆయన ఏ కూటమితో జట్టు కడుతారనే అంశంపై ఇంకా సస్పెన్స్ కొనసాగిస్తున్నారు. ఫలితాలు వెలువడేవరకు వేచిచూస్తామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే చంద్రబాబుతో టచ్లోనే ఉన్నట్టు ఓ ప్రశ్నకు బదులిచ్చారు. మరోవైపు అధికార అన్నాడీఎంకే కూడా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను తోసిపుచ్చింది. ఎన్నికల్లో తమ పార్టీ బాగా పనిచేసిందని, మంచి ఫలితాలు వస్తాయని తమిళనాడు సీఎం ఎడపాటి పళనిస్వామి ఆశాభావం వ్యక్తం చేశారు.
బీజేపీ సుప్రీంకోర్టును తమ చేతుల్లో పెట్టుకుంది…