సార్వత్రిక ఎన్నికల్లో పోటెత్తిన మహిళా ఓటర్లకు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ధన్యవాదాలు చెబుతున్నానని ఓ వీడియో ట్వీట్లో రాహుల్ పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో మహిళలు కేవలం అభ్యర్ధులుగానే కాకుండా తమ గొంతుక వినిపించేందుకు కట్టుబడిన ఓటర్లుగానూ కీలకంగా వ్యవహరించిన వారందరికీ తాను శాల్యూట్ చేస్తున్నా’నని రాహుల్ ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ ప్రకటించిన న్యాయ్ పథకం మహిళలకు దక్కాల్సిన న్యాయపరమైన వాటాను వారికి లభించేలా చేస్తుందని ఈ వీడియోలో మహిళలు అభిప్రాయపడ్డారు. ఏడవ, తుది విడత పోలింగ్ ముగియనున్న నేపథ్యంలో రాహుల్ మహిళా ఓటర్లకు ధన్యవాదాలు చెబుతూ ఈ ట్వీట్ను పోస్ట్ చేయడం గమనార్హం.
ఐదేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలు: మంత్రి బొత్స