telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఐదేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలు: మంత్రి బొత్స

minister bosta in vijayawada meeting

చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ ను అప్పుల పాలు చేశారని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఆర్థిక పరిస్థితి క్రమంగా క్షీణించిందన్నారు. చంద్రబాబు రాష్ట్రాన్ని 25 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని ఆయన విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ విభజనకు తెలుగుదేశం అనుకూలమని చెప్పింది నిజం కాదా? అని ప్రశ్నించారు.

రాష్ట్ర విభజన తర్వాత అనుభవమున్న వ్యక్తికి అవకాశం ఇవ్వాలని ప్రజలను చంద్రబాబు అడిగారు. దాంతో ప్రజలు ఆయనకు అవకాశమిచ్చారు. ఒక టౌన్ షిప్ కడితే సంపద వస్తుందా? అని ప్రశ్నించారు. ఆ ప్రాంతంలో భూముల ధరలు పెరిగెతే పెరగవచ్చు, కానీ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయా? అని నిలదీశారు.

Related posts