ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబుతో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో ఏచూరి మాట్లాడుతూ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలతో చర్చలు జరుగుతూనే ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం కేవలం ప్రాథమిక సంప్రదింపులు మాత్రమే జరుపుతున్నామని చెప్పారు.
ఎన్నికల ఫలితాల తర్వాత ఎవరు నాయకత్వం వహించాలో నిర్ణయిస్తామని, దానిపై ఇప్పుడే ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేమని తెలిపారు. మరోవైపు బీజేపీయేతర కూటమి ఏర్పాటు దిశగా గత మూడురోజులుగా ఢిల్లీలో చంద్రబాబు బిజీగా గడుపుతున్నారు. జాతీయ పార్టీ నేతలతో ఆయన సమావేశమవుతున్నారు. నిన్న రాహుల్ గాంధీ, శరద్ పవార్, అఖిలేష్ యాదవ్, మాయావతితో చంద్రబాబు భేటీ అయ్యారు.
ఆర్టికల్ 257 కింద రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం చర్యలు: యనమల