టీవీ9లో వాటాల అమ్మకం రచ్చ రాజుకుంది. ఆ సంస్థ యాజమాన్యం మార్పిడికి సంబంధించిన వ్యవహారంలో ఫైనాన్స్ డైరెక్టర్ మూర్తి ఇంట్లోనూ పోలీసుల సోదాలు జరిపారు. మూర్తికి టీవీ9 ఛానల్లో 1.5 శాతం వాటాలున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాల్సిందిగా టీవీ9 సీఈవో రవిప్రకాశ్, సినీనటుడు శివాజీతో పాటు మూర్తికి పోలీసులు నోటీసులు జారీ చేశారు.
కేసు విచారణలో భాగంగా ఆ సంస్థ కార్యాలయంలో పలు ల్యాప్టాప్లు, హార్డ్డిస్క్లు, పత్రాలను సైబరాబాద్ సీసీఎస్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపనున్నట్లు తెలిపారు. మరోవైపు తనపై వచ్చిన ఆరోపణలను టీవీ9 సీఈవో రవిప్రకాశ్ ఖండించారు. ఆరోపణలన్నీ అవాస్తవాలేనని ఆయన చెప్పారు.