telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఎట్టకేలకు ప్రియాంక గాంధీ పోటీపై క్లారిటీ!

Priyanka Gandhi started Ist road show

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని వార‌ణాసి లోక్ సభ స్థానం నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేసే విషయంలో ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. వారణాసి లో ప్రధాని మోదీపై ప్రియాంకగాంధీ పోటీ చేస్తుందని జరుగుతున్న ప్రచారానికి తెర పడింది. తాజాగా అజ‌య్ రాయ్‌ను కాంగ్రెస్ అభ్య‌ర్థిగా బరిలో నిలుపుతూ అధిష్టానం ఈరోజు ప్రకటించింది. మోదీపై అజయ్ రాయ్ ను బరిలోకి దింపింది. ఈ మేరకు సీఈసీ జనరల్ సెక్రటరీ ఇన్‌చార్జి ముకుల్ వాస్నిక్ ఒక ప్రకటన విడుదల చేశారు.

2014లోనూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అజ‌య్ రాయ్‌నే పోటీకి నిలిపిన కాంగ్రెస్‌ ఈసారి కూడా ఆయననే బరిలోకి దింపింది. మరోవైపు వారణాసి నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధాని రెండోసారి కూడా వారణాసినుంచే పోటీ చేయనున్నారు. ఈ నెల 26న నామినేషన్ వేసేందుకు సన్నద్ధమవుతున్నారు. వారణాసి నుంచి మహాకూటమి అభ్యర్థిగా సమాజ్ వాదీ పార్టీ నాయకురాలు షాలిని యాదవ్ బరిలోకి దిగారు.

Related posts