తెలంగాణ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో వెట్ రన్ విజయవంతమైంది. ఈ ప్రాజెక్టులో నీటిని ఎత్తిపోసేందుకు ఏర్పాటుచేసిన మొదటి పంపు వెట్ రన్ విజయవంతంగా ప్రారంభమయింది. తొలుత పూజలు నిర్వహించిన అనంతరం అధికారులు మోటర్ ను ఆన్ చేశారు. దీంతో ఒక్కసారిగా నీళ్లు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. ఈ సందర్భంగా అక్కడ ఉన్న అధికారులు, స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.
నందిమేడారం సర్జ్ పూల్ లో ఉన్న నీటిని ఈ మోటార్లు ఎత్తిపోస్తున్నట్లు అధికారులు తెలిపారు. వెట్ రన్ విజయవంతం కావడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ కృషిలో పాలుపంచుకున్న ఇంజినీర్లు, టెక్నీషియన్లు, వర్కర్లకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ వెంకటేశ్వర్లుకు సీఎం ఫోన్ చేసి అభినందించారు.