గత కొంతకాలం క్రితం ఫిలిం ఇండస్ట్రీలో “మీటూ” ఉద్యమం సంచలనం సృష్టించింది. మీటూలో భాగంగా పలువురు సినిమా ప్రముఖులపై పెద్ద ఎత్తున లైంగిక ఆరోపణలు వెలువెత్తాయి. అలా లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న చాలామందికి అవకాశాలు తగ్గిపోయాయి. కానీ అందులో భాగంగా అత్యాచార ఆరోపణలు ఎదుర్కొన్న బాలీవుడ్ సీనియర్ నటుడు అలోక్ నాథ్ కు మాత్రం మళ్ళీ సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన అజయ్ దేవగణ్ తన సినిమాలో అలోక్ నాథ్ కు తీసుకుంటున్నందుకు ఇప్పటికే తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.దీనిపై అజయ్ ఆంగ్ల మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు.
“దే దే ప్యార్ దే” అనే మూవీ చిత్రీకరణ గత ఏడాది సెప్టెంబర్లో పూర్తైంది. సినిమాని అక్టోబర్లో విడుదల చేయాలని అనుకున్నాం. అలోక్ నాథ్కి సంబంధించిన సన్నివేశాలు మనాలీలో ఆగస్ట్లోనే చిత్రీకరించాం. ఆ సమయంలో ఆయనపై ఎలాంటి ఆరోపణలు లేవు. దాదాపు 40 రోజుల పాటు అలోక్తో కలిపి పదిమంది ఆర్టిస్ట్లపై సన్నివేశాలని చిత్రీకరించాం. ఇప్పుడు ఆయనతో పాటు వేరే ఆర్టిస్ట్లు కూడా పలు సీన్స్లో భాగస్వాములుగా ఉన్నారు. ఒక్కడి సీన్స్ ఉంటే వెంటనే తొలగించే వాళ్లం. కాని కాంబినేషన్ సీన్స్ ఉండడంతో ఇప్పుడు ఆయన సీన్స్ తొలగించి రీ షూట్ చేయడం ఖర్చుతో కూడుకున్న పని. కాని ఇప్పుడు సడెన్గా ఆయనని సినిమా నుండి తప్పించి షూట్ చేయడమంటే కుదరుదు అని అజయ్ దేవగణ్ వెల్లడించాడు.
టాలీవుడ్ మొత్తాన్ని నెపోటిజం నడిపిస్తోంది… ఇలియానా సంచలన వ్యాఖ్యలు