పేదలను, కార్మికులను ఆదుకునేందుకు రాష్ట్రంలో ‘అన్న’ క్యాంటీన్లు పెట్టామని టీడీపీ అధినేత, ఏపీ చంద్రబాబు నాయుడు అన్నారు. పోలింగ్ కు తగినంత సమయం లేకపోవడంతో సుడిగాలి పర్యటనలు, రోడ్ షోలతో చంద్రబాబు ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో ఆయన బుధవారం రాత్రి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో అయినా ఇలాంటి క్యాంటీన్లు ఉన్నాయా? అని ప్రశ్నించారు. హైదరాబాద్ లో రోడ్ల పక్కన భోజనాలు పెట్టారు, జనాలేమైనా బిచ్చగాళ్లా? అంటూ ప్రశ్నించారు. తాము పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నామని స్పష్టం చేశారు. తాను చేసిన అభివృద్ధి చూసి ఓటేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
previous post
next post
చంద్రబాబు, కేసీఆర్ తెలుగు రాష్ట్రాలకు గ్రహణం: బండారు దత్తాత్రేయ