ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకు భద్రతను తగ్గించిన సంగతి తెలిసిందే. జడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీలో ఉండే చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలగించిదని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ అంశంపై ఏపీ హోం మంత్రి సుచరిత స్పందించారు.
చంద్రబాబుకు చట్ట పరిధిలోనే భద్రతను కేటాయించామని చెప్పారు. ఏ స్థాయి వ్యక్తులకు ఎంత భద్రత కల్పించాలనేది భద్రతా సమీక్ష కమిటీ నిర్ణయిస్తుందని తెలిపారు. కక్ష పూరితంగా తాము నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. చంద్రబాబు భద్రత విషయాన్ని కొందరు అనవసరంగా రాజకీయం చేస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు.
చంద్రబాబు అన్ని వ్యవస్థలనూ మేనేజ్ చేస్తున్నాడు: ఏపీ మంత్రులు