న్యూస్ పేపర్ చదువుతూ ఓ ఎమ్మెల్యే గుండెపోటుతో మృతి చెందారు. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. అన్నాడీఎంకే పార్టీకి చెందిన సూలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కనకరాజ్(67) హతాన్మరణం చెందారు. ఉదయం ఇంట్లో పేపర్ చదువుతూ ఒక్కసారిగా ఆయన కుప్పకూలారు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగాఅప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు నిర్దారించారు. ఆయన మృతి పట్ల అన్నాడీఎంకే పార్టీ దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. కనకరాజ్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో సూలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
previous post