telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

కొత్త వాదన… యూపీఏ పగ్గాలు ఆమెకు ఇవ్వాలి

పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమత నేతృత్వంలోని తృణమూల్ పార్టీ భారీ విజయం సాధించింది. 221 స్థానాల్లో పార్టీ విజయం సాధించింది. దేశంలో బీజేపీ ని ఎదుర్కొనే సత్తా మమత ఒక్కరికే ఉందని, ఆమెకు యూపీఏ పగ్గాలు అప్పగించాలని, యూపీఏ పగ్గాలు ఆమెకు అప్పగిస్తేనే వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే ను ఓడించవచ్చని ఓ వర్గం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం యూపీఏ చైర్మన్ గా సోనియా గాంధీ ఉన్నారు. సోనియా గాంధీ ఆ బాధ్యతల నుంచి తప్పుకొని ఆ స్థానంలో రాహుల్ ను నియమించాలని చూస్తున్నారు. అయితే, రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఫెయిల్ అయ్యారు. 2019 ఎన్నికల తరువాత కాంగ్రెస్ నాయకత్వం నుంచి రాహుల్ తప్పుకున్న సంగతి తెలిసిందే. కానీ, ఇప్పుడు తిరిగి ఆయనకే పగ్గాలు అప్పగించాలని చూస్తున్నారు. అయితే చూడాలి మరి ఈ డిమాండ్ ఇంకా ఎంత దూరం వెళ్తుంది అనేది.

Related posts