ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చిత్తూర్ జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారుతుంది. తమకు టికెట్లు దక్కనందున నేతలు మరో పార్టీ తీర్థం పుచ్చుకుంటుంటే. మరో వైపు టికెట్ దక్కించుకున్న నేతలు పోటీ చేయబోమని అంటున్నారు. టీడీపీ నుంచి నెల్లూరు రూరల్ టికెట్ దక్కించుకున్న ఆదాల ప్రభాకర్ రెడ్డి అనంతరం వైసీపీ లో చేరారు. తాజాగా తనకు టికెట్ వద్దంటూ పూర్ణం అందుబాటులో లేకుండా పోయారు. టికెట్ కేటాయించి 36 గంటలైనా గడవకముందే పోటీ చేయలేనని ఆయన చేతులెత్తేశారు.
పూతలపట్టు టీడీపీ ఇన్చార్జ్గా ఉన్న మాజీ ఎమ్మెల్యే లలితకుమారికే ఇక్కడ టికెట్ వస్తుందని అందరూ భావించారు. అందుకు అనుగుణంగానే ఆమె ప్రచారంలోకి కూడా దిగిపోయారు. అయితే టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు అనూహ్యంగా తెర్లాం పూర్ణంకు సోమవారం రాత్రి టికెట్ కేటాయించారు. దీంతో ఈ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేసిన పూర్ణం తాను పోటీచేయబోనని తేల్చిచెప్పారు. ఈ క్రమలో ఎవరూ పట్టించుకోకపోవడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ఏం చేయాలో తోచక పూతలపట్టు టీడీపీ నాయకులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
అమరావతి నేల నిర్మాణాలకు అనుకూలం కాదు: విజయసాయిరెడ్డి