telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నీటిపారుదల రంగానికి పూర్వ వైభవాన్ని తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి నిమ్మల రామానాయుడు

ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రస్తుతం రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి.

ముఖ్యంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయడమే లక్ష్యంగా ఆయన పనిచేస్తున్నారు.

గత ప్రభుత్వ హయాంలో దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ పునర్నిర్మాణ పనుల్లో 83 శాతం ఇప్పటికే పూర్తయ్యాయి.

గోదావరి జలాలను అనకాపల్లి వరకు అందించేందుకు వీలుగా పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులను సాగు సీజన్‌కు ముందే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జూన్ నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేసి నల్లమలసాగర్ రిజర్వాయర్‌ను నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

రాయలసీమను కరువు రహిత ప్రాంతంగా మార్చడానికి సాగునీటి భద్రత కల్పించడంపై మంత్రి దృష్టి పెట్టారు. హంద్రీ-నీవా సుజల స్రవంతి వంటి కీలక ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.

పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టుకు సాంకేతిక మరియు ఆర్థిక అనుమతులు ఇవ్వాలని, అలాగే పెండింగ్ డిజైన్లను ఆమోదించాలని ఆయన ఇటీవల కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శిని కోరారు.
గోదావరి, కృష్ణా, పెన్నా వంటి నదుల ఏటిగట్ల పటిష్టత కోసం నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రతి ప్రాజెక్టుకు నిర్దేశిత గడువు విధించారు. ఆ సమయానికి పనులు పూర్తి చేయని పక్షంలో అధికారులు అమరావతికి వచ్చి సమాధానం చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు.

రాష్ట్రంలో సాగునీటి సంఘాలను బలోపేతం చేయడం ద్వారా సాగునీటి రంగానికి పూర్వవైభవం తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది మంత్రి తెలిపారు .

Related posts