*మునుగోడు ఉపఎన్నిక అభ్యర్ధిని ప్రకటించిన కాంగ్రెస్
*అధికారికంగా మునుగోడు కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వాయి గోవార్ధన్ రెడ్డి ప్రకటించిన ఏఐసీసీ
మునుగోడు ఉపఎన్నికకు అభ్యర్థి పేరును కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మాజీ ఎంపీ దివంగత పాల్వాయి గోవర్ధన్రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతిని అభ్యర్థిగా ఖరారు చేసింది.
ఈ మేరకు సీఈసీ జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ ముకుల్ వాస్నిక్ పేరిట ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.. మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి శ్రవంతి పేరును ఖరారు చేశారని, మునుగోడు బైపోల్లో ఆమె పోటీ చేయనున్నారని ప్రకటించారు.
ఉప ఎన్నికకు కాంగ్రెస్ టికెట్ కోసం పలువురు పోటీ పడ్డారు. స్రవంతితో పాటు స్థానిక నేతలు చల్లమల్ల కృష్ణారెడ్డి, పల్లె రవికుమార్, కైలాష్ తదితరులు టికెట్ను ఆశించారు. ఈ ప్రకటనతో ఇప్పటి వరకు ఆశావహుల్లో ఉన్న కన్ఫ్యూజన్ తొలగిపోయినట్లు అయ్యింది.
కాంగ్రెస్ పార్టీకి, మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి.. బీజేపీ అభ్యర్థిగా మరోసారి మునుగోడు ఎమ్మెల్యేగా మునుగోడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అంటే బీజేపీ అభ్యర్థి ఖరారైనట్లే. మరోవైపు టీఆర్ ఎస్ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది.