సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. పరశురామ్ దర్శకత్వం తెరకెక్కిన ఈ సినిమాలో సరసన కీర్తీ సురేష్ కథానాయికగా నటించారు.
ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, టీజర్లు మంచి స్పందన రాగా.. కళావతి, ఎవ్రీ పెన్నీ పాటలు అత్యధిక వ్యూస్తో రికార్డు క్రియేట్ చేశాయి. ఈ సినిమా సమ్మర్ కానుక మే 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
దీంతో మూవీ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తోంది చిత్ర బృందం. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. ఆదివారం చిత్రబృందం చెప్పినట్టుగానే ట్రైలర్ను 105 షాట్స్తో మేకర్స్ రిలీజ్ చేశారు.
ఇందులో మహేష్ బాబులుక్ హ్యాండ్సమ్గా కనిపించారు.ప్రతి ఫ్రేమ్ లోను మహేష్ తప్ప పక్కన వున్నవారు కనిపించడంలేదు అంటే అతిశయోక్తి కాదు.
క్లాస్ మాస్ మిక్స్ చేసి మహేష్ కుమ్మేశాడు. ట్రైలర్ మొదట్లో నా ప్రేమను దొంగలించగలవు, నా స్నేహాన్ని దొంగలించగలవు, నా మనీని మాత్రం దొంగలించలేవు అంటూ మహేష్ డైలాగ్ తో చెప్పడం అదిరిపోయింది. కీర్తితో మహేష్ కెమిస్ట్రీ, డైలాగ్స్ కూడా మెప్పిస్తున్నాయి.
‘వెన్నెల’ కిశోర్, సుబ్బరాజు తదితరులు నటిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మాతలు. ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు.