సూపర్ స్టార్ మహేశ్బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన చిత్రం సర్కారు వారి పాట. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం విడుదలకు ముందే పలు రికార్డులను సొంతం చేసుకుంటోంది.
ఈమూవీ నుంచి వచ్చిన పాటలకు మిలియన్స్ లో వ్యూస్ వస్తున్నాయి.రీసెంట్ గా కళావతి సాంగ్.. సరికొత్త రికార్డ్స్ని క్రియేట్ చేస్తోంది. ‘వందో, ఒక వెయ్యో, ఒక లక్ష మెరుపులు మీదికి దూకినాయా.. ఏందే ఈ మాయ.. కమ్మ కమ్మాన్ కళావతి.. నువ్ లేకుంటే అధోగతి..’ అంటూ సాగే లిరిక్స్ అనంత శ్రీరామ్ సాహిత్యాన్ని అందించగా ఈ పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా ఆలపించాడు.. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీని అందించారు.
ఇక తాజాగా ఆ పాట 150 మిలియన్ ప్లస్ వ్యూస్ ను సాధించి అరుదైన రికార్డును నమోదు చేసింది. ఈ సందర్భంగా ఈ సినిమా టీమ్ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది
విడుదలైన నాటి నుంచి యూట్యూబ్లో ట్రెండింగ్లు ఉన్న ఈ ‘కళావతి’ ఈ సంవత్సరంలోని పాటలన్నింటిలో మెలోడీ సాంగ్గా ముద్ర వేసుకొంది.
సినిమా ఇప్పటికే మ్యూజికల్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో..సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ చిత్రాన్ని జీఎంబీ ప్రొడక్షన్స్, మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సమ్మర్ కానుకగా ఈ చిత్రం మే 12న విడుదలవుతోంది.