భారత వాయుసేన తన యుద్ధ విమానాలతో జరిపిన బాంబు దాడులపై పాకిస్థాన్ స్పందించింది. భారత్ సరిహద్దుల్లో హింసాత్మక ఘటనలకు ప్రేరిపిస్తోందని ఆ దేశ ఆర్మీ అధికార ప్రతినిధి మేజర్ జెనరల్ అసిఫ్ గఫూర్ ట్వీట్ చేశారు. భారత విమానాలు నిబంధనలను ఉల్లంఘించి తమ సరిహద్దుల్లోకి వచ్చిన మాట వాస్తవమేనని, పాక్ వైమానిక దళాలు తిప్పికొట్టాయని ప్రకటించింది. దీంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని గఫూర్ స్పష్టం చేశారు. భారత్ వైమానిక దాడుల అనంతరం దానికి సంబంధించి ఫోటోలను పాక్ విడుదల చేసింది. అయితే ఈ దాడుల్లో 300మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. తమ దేశంలో ఉగ్రవాద శిబిరాలు అంటూ ప్రత్యేకంగా ఏమీ లేవని, భారత ప్రభుత్వం చేసుకుంటున్న ప్రచారం అవాస్తవమని వెల్లడించింది.
previous post
next post