telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పిఠాపురం గొల్లప్రోలు గ్రామం లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ఎమ్మెల్యేగా విజయం సాధించిన తరువాత డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గానికి తొలిసారి వచ్చారు.

జూలై 1 సందర్భంగా వృద్దులకు, వితంతువులకు, వికలాంగులకు పెన్షన్ పంపిణీ చేసేందుకు పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు గ్రామానికి చేరుకున్నారు.

అక్కడ ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్దిదారులకు స్వయంగా తన చేతుల మీదుగా పెన్షన్ డబ్బులు రూ. 7 అందజేశారు.

అనంతరం అక్కడి స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అదే గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
పంచాయితీ రాజ్ లెక్కలు చూస్తుంటే నిధులన్నీ ఎటు వెళ్ళాయో అర్థం కావటంలేదు అని అన్నారు.

రూ.600 కోట్లు ఖర్చు చేసి రుషికొండలో భవనాలు కట్టారని  అదే డబ్బుతో ఎంతో అభివృద్ధి జరిగి ఉండేదని అన్నారు.

తన కార్యాలయంలోకి ఫర్నీచర్ ఇస్తాను అని అధికారులు చెబితే వద్దూ నేనే కొనుకుంటాని చెప్పానన్నారు. తన వైపు నుండి అవినీతి అనేది ఉండదని మాట ఇస్తున్నానన్నారు.

పంచాయతీరాజ్ శాఖలో జలజీవన్ మిషన్ పథకంలో భాగంగా ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి ఉండాలని ఆదేశించారు.
తన దేశం కోసం తన కల కోసం పనిచేస్తే వచ్చే జీతం తనకు వద్దని.. అందుకే ప్రతి నెల తీసుకునే జీతాన్ని వదిలేస్తున్నానన్నారు.

Related posts