మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆదివారం అమరావతి పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. భవిష్యత్లో పార్టీ ఏ రకమైన కార్యాచరణ తీసుకొనే విషయమై పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ చర్చించారు. గత నెల 11వ తేదీన జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల విజయావకాశాలపై పవన్ చర్చించారు.
స్థానిక సంస్థల ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆయన పార్టీ శ్రేణులను కోరారు. గ్రామ స్థాయిలో ఉన్న సమస్యలపై నేతలు దృష్టిని సారించాలని సూచించారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.
బీజేపీలో టీడీపీ విలీనం చెందిందన్నది వట్టిదే: గల్లా జయదేవ్