telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఆమెరికన్లకు శుభవార్త.. ఇక నుంచి మాస్క్ అవసరమే లేదు

చైనా లో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ ఈ వైరస్ విలయం కొనసాగుతూనే ఉంది. అయితే మొన్నటి వరకు అమెరికాలోనూ కరోనా విజృంచింది. అయితే తాజాగా అమెరికన్లకు అక్కడి ప్రభుత్వం ఓ శుభవార్త చెప్పింది. మాస్కులు ధరించడంపై అమెరికన్లకు ఆ దేశ వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం (సీడీసీ) కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. కరోనా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న ప్రజలు ధరించాల్సిన అవసరం లేదని పేర్కొంది. కరోనాతో నాడు అత్యంత దారుణంగా ప్రభావితమైన అమెరికా.. సాధారణ పరిస్థితుల వైపు శరవేగంగా అడుగులు వేస్తోందనడానికి ఇదే నిదర్శనం. ఇక సీడీసీ ప్రకటనపై అధ్యక్షుడు జో బైడెన్ హర్షం వ్యక్తం చేశారు. అమెరికన్లకు వ్యాక్సిన్లను శరవేగంగా అందిస్తుండటం వల్లే ఈ మైలురాయి సాధ్యమైందని పేర్కొన్నారు.

Related posts