పవర్స్టార్ పవన్కల్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘భీమ్లా నాయక్ . సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నిత్యమేనన్, సంయుక్త మేనన్ హీరోయిన్లుగా నటించారు.
![మలయాళంలో బ్లాక్బస్టర్గా నిలిచిన ‘అయ్యప్పునుమ్ కోశీయుమ్’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు కథలో కొన్ని మార్పులు కూడా చేసారు. ఒరిజినల్ ఉన్నదున్నట్లు తీస్తే ఇద్దరి కారెక్టర్స్ సేమ్ టూ సేమ్ ఉంటాయి. ఓ డబ్బున్న వ్యక్తి అహానికి.. ఓ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ ఆత్మ గౌరవానికి మధ్య జరిగే పోరాటమే ‘అయ్యప్పునుమ్ కోశీయుమ్’ కథ. మలయాళంలో డబ్బున్న వ్యక్తిగా పృథ్విరాజ్.. పోలీస్ ఆఫీసర్గా బిజూ మీనన్ నటించారు.,[object Object]](https://images.news18.com/telugu/uploads/2022/02/Bheemla-Nayak-OTT.jpg)
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదైలన పోస్టర్స్, సాంగ్స్ యూట్యూబ్ని షేక్ చేశాయి.దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి
తాజాగా సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి U/A ఇవ్వడం జరిగింది. ఇక సెన్సార్ పూర్తి అయినట్లు మేకర్స్ కొత్త పోస్టర్ తో తెలిపారు. ఫిబ్రవరి 25న భీమ్లా నాయక్ విడుదల కానుంది. రేపు (శనివారం) ఈ చిత్ర ట్రైలర్ను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

మలయాళంలో బ్లాక్బస్టర్గా నిలిచిన ‘అయ్యప్పునుమ్ కోశీయుమ్’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు.ఇందులో పోలీస్ ఆఫీసర్ గా పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. ఈ సినిమా.. ఫిబ్రవరి 25న థియేటర్లలోకి రానుంది.

