ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కు కరోనా సోకడంతో గత నాలుగు రోజులుగా హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు.
తాజాగా ఆరోగ్యం పై ఆయన కుమారుడు అజయ్ శివశంకర్ మాట్లాడారు.. ఏఐజీ ఆస్పత్రిలో మాస్టర్కు వైద్యం కొనసాగుతోందని చెప్పారు. కరోనా కారణంగా ఆయన లంగ్స్కు చాలా ఎఫెక్ట్ అవ్వడంతో వెంటిలేటర్ పై ఐసీయూ వార్డ్లో ఉన్నారని, తన అన్న కూడా ఐసీయూలో చికిత్స పొందుతున్నారని, తల్లి ఇంట్లో ఐసోలేషన్లో ఉన్నారని తెలిపారు
వారం రోజుల్లో ఇంట్లో ముగ్గురికి కరోనా సోకడం వల్ల చాలా డిప్రెషన్లోకి వెళ్లినట్లు చెప్పారు అజయ్. మీ ఆశీస్సులు తప్పకుండా ఆయనకు ఉండాలి, వెంటిలేటర్పై బయటకు రావాలని , అన్నయ్య కూడా రికవరీ అవుతున్నాడు అన్నారు.ఈ విషయం తెలవగానే సినీ పరిశ్రమలో ఉన్న ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి, సోనూసూద్, డాన్స్ మాస్టర్లు లారెన్స్, జానీ సహా ఇతరులు తమకు అండగా ఉన్నట్లు తెలిపారు.
సహాయం చేసిన వాళ్ల అందరికీ చాలా థ్యాంక్స్..దేవుడు దయవల్ల నాన్న బయటకు రావాలని, మీ ఆశీస్సులు, సపోర్ట్ కావాలని అజయ్ శివశంకర్ కోరారు.