గతంలో ఎన్నడూ లేనంతగా తిరుమల తిరుపతి లో కురుస్తున్న భారీ వర్షాలకు భక్తులు మరియు స్థానికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు మనసును కలిచివేస్తున్నాయని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదిక గా వ్యాఖ్యానించారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానం లు కలిసి కట్టుగా కృషి చేసి, సాధ్యమైనంత త్వరగా సాధారణ పరిస్థితులను నెల కొల్పాలి అని అన్నారు. అన్ని రాజకీయ పక్షాలు మరియు తన అభిమాన సంఘాలు సైతం చేయుట నివ్వాల్సింది గా కోరుతున్నా అంటూ మెగాస్టార్ చిరంజీవి అన్నారు.
చిత్తూరు జిల్లాలో వరదలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా తిరుమల, తిరుపతిలో పరిస్థితులు మరింత దారుణంగా మారాయి.. గతంలో ఎప్పుడూ లేనంత స్థాయిలో తిరుమల ఘాట్ రోడ్డులోనూ.. తిరుపతిలోనూ వరదనీరు పారుతూ భక్తుల్ని, స్థానికులను భయందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే అక్కడ అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు.
ఇక ఆ పాత్ర చేయలేను : చిరంజీవి