ఈరోజు జాతిపిత మహత్మాగాంధీ 152వ జయంతి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాపూజీకి ఘన నివాళులు అర్పించారు. గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాకారానికి గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలో రెండేళ్ల కిందటే అడుగులు పడ్డాయని అన్నారు.
నేటి నుంచి `క్లీన్ ఆంధ్రప్రదేశ్`కు శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. మహాత్ముడి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అంటూ ట్వీట్ చేశారు. టీపీడీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా మహత్మాగాంధీకి నివాళు అర్పించారు.
గాంధీగారు కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాకారానికి గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలో రెండేళ్ల క్రితమే అడుగులు పడ్డాయి. నేటి నుంచి `క్లీన్ ఆంధ్రప్రదేశ్`కు శ్రీకారం చుడుతున్నాం. మహాత్ముడి జయంతి సందర్భంగా నివాళులు.#GandhiJayanti #CleanAndhraPradesh
— YS Jagan Mohan Reddy (@ysjagan) October 2, 2021
కులాలుగా, మతాలుగా విడిపోని సంపూర్ణ సమైక్య జాతి నిర్మాణాన్ని, రాజకీయాలలో నైతికతను గాంధీజీ ఆశించారు. అటువంటి సమ సమాజము, నిజాయితీ కూడిన రాజకీయాలు రావాలంటే ముందుగా ప్రజల్లోనే చైతన్యం రావాలి. అప్పుడే సమాజాన్ని విడగొట్టే వారి కుట్రలకు అడ్డుకట్ట వేయగలం.(1/2)#GandhiJayanti pic.twitter.com/96cswni5Z8
— N Chandrababu Naidu (@ncbn) October 2, 2021
నవభారత శక్తికి, భారతావని పవిత్రతకు, భారతీయుల ఉత్తమ సంస్కృతికి ప్రతీక అయిన ఆదర్శమూర్తి… గాంధీజీ జయంతి సందర్భంగా ఆ మహాత్ముని స్మృతికి నా నివాళులు(2/2)
— N Chandrababu Naidu (@ncbn) October 2, 2021
అప్పలనాయుడిని చూస్తుంటే అలా అనిపించడం లేదు: రోజా