telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అప్పలనాయుడిని చూస్తుంటే అలా అనిపించడం లేదు: రోజా

Roja Mla

ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తమ్మినేని సీతారాంకు ఎమ్మెల్యే రోజా అభినందనలు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆమె మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న తమ్మినేని ఈ పదవిని దక్కించుకున్నందుకు అందరూ సంతోషపడాలని అన్నారు. ముఖ్యంగా తమ్మినేని సొంత జిల్లాకు చెందిన వాసులు మరింత సంతోషపడాలి కానీ, అచ్చెన్నాయుడిని చూస్తుంటే అలా అనిపించడం లేదని రోజా అన్నారు. ఆయన మాటలు చూస్తుంటే సంతోషం కంటే కడుపుమంటే ఎక్కువగా ఉన్నట్టు కనపడుతోందని దుయ్యబట్టారు.

వెనుకబడిన వర్గానికి చెందిన తమ్మినేనికి అత్యున్నత స్థానంలోఅవకాశం కల్పించిన తమ అధినేత జగన్ కు కూడా కృతఙ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. స్పీకర్ ను అవమానించడంలో గానీ, ఆ చైర్ ను దుర్వినియోగం చేయడం గానీ చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని గతాన్ని చూసిన ఇప్పుడు చూసినా అర్థమవుతుందని అన్నారు. ఎందుకంటే, గతంలో కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్ అయినప్పుడు ఆయన్ని గౌరవించకుండా అవమానించడం ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారని అన్నారు.

Related posts