పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. కొంతకాలంగా ఈ సినిమాకి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఎప్పటి నుంచో పవన్ సినిమా తీయాలని డైరెక్ట్ర్ హరీశ్ శంకర్ సన్నాహాలు చేస్తున్నాడు. ఈ మేరకు పవన్ పుట్టిన రోజున తమ కాంబినేషన్లో సినిమా తెరకెక్కనుందంటూ ప్రీ లుక్ విడుదల చేశాడు డైరెక్టర్.
ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. రేపు ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ రాబోతుందని తాజాగా మేకర్స్ ప్రకటించారు. సెప్టెంబర్ 9న ఉదయం 9.45 గంటలకు ఈ మూవీ నుంచి పవర్ ప్యాక్ట్ అప్డేట్ ఇవ్వబోతున్నట్లు తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ చిత్ర నిర్మాతలు, దర్శకుడు హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ను కలిసి సినిమా షూటింగ్ విషయమై చర్చలు జరిపారు.
దీనికి సంబంధించిన ఫొటోను చిత్రయూనిట్ అధికారికంగా విడుదల చేసింది. ఈ అనౌన్స్మెంట్ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. దీంతో ఫ్యాన్స్ అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో పవన్కు జోడీగా పూజా హెగ్డే నటించనున్నట్లు సమాచారం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే నెల సెట్స్పైకి వెళ్లనుంది.
Get ready for Next Level Celebrations 💥💥
A POWER PACKED ANNOUNCEMENT will enthrall you tomorrow at 9:45 AM 😎😎@PawanKalyan @harish2you @ThisIsDSP @DoP_Bose #AnandSai @venupro pic.twitter.com/1uTGZpRNUd
— Mythri Movie Makers (@MythriOfficial) September 8, 2021