గతేడాది అక్టోబర్లో ప్రముఖ బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా… బాలీవుడ్ నటుడు నానా పటేకర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలతో మీటూ ఉద్యమానికి తెరలేపింది. ఆ తర్వాత ఎందరో నటీమణులు తమను వేధించిన దర్శకులు, నిర్మాతలు, హీరోల పేర్లు బయటపెట్టారు. సినీ పరిశ్రమకు చెందినవార మాత్రమే కాదు క్రికెటర్ల పేర్లు కూడా బయటికి వచ్చాయి. మీటూ గురించి తాజాగా దీపిక పదుకోన్ను స్పందించాల్సిందిగా ఓ ఇంటర్వ్యూలో కోరారు. ఈ విషయం గురించి దీపిక మాట్లాడుతూ “వ్యాలిడ్ ప్రశ్న వేశారు. మీటూలో క్రికెటర్లు, ఇతర క్రీడాకారులు కూడా ఉన్నారు. వారిని ఎందుకు ప్రశ్నించడంలేదని అడిగారు. ఇప్పటివరకు ఈ ప్రశ్నను కేవలం నటీనటులను మాత్రమే అడిగారు. స్పోర్ట్స్ పర్సన్స్ని అడగడం నేను ఇంతవరకు చూడలేదు. కేవలం సినీ ఇండస్ట్రీలో మాత్రమే ఈ లైంగిక వేధింపులు జరగడంలేదు. ప్రపంచంలోని అన్ని వర్క్ ప్లేసెస్లో జరుగుతున్నాయి. అలాంటి ప్రదేశాలన్నీ సురక్షితంగా ఉండాలి” అన్నారు. దీపిక చెప్పినట్లు పలువురు క్రికెటర్ల పేర్లు కూడా బయటికి వచ్చాయి. శ్రీలంకకు చెందిన ప్రముఖ క్రికెటర్లు లసిత్ మలింగ, అర్జున్ రణతుంగల పేర్లు కూడా బయటికి వచ్చాయి. కానీ వారి గురించి ఇప్పటివరకే ఏ క్రికెటర్ కూడా మాట్లాడలేదు.
previous post