telugu navyamedia
తెలంగాణ వార్తలు

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులు.. తెలంగాణ నుండి ఇద్దరు ఎంపిక

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులు ప్రకటించింది కేంద్రం. దేశవ్యాప్తంగా 44 మంది ఉపాధ్యాయులు పురస్కారాలకు ఎంపిక అయ్యారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఇద్దరు.. కే. రంగయ్య, పయ్యావుల రామస్వామి  ఎంపిక అయ్యారు. 

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు రాష్ట్రం నుంచి ఇద్దరు ఎంపిక ఆసిఫాబాద్ జిల్లా సావర్‌ఖేడ్‌ ప్రధానోపాధ్యాయుడు రంగయ్య ఎంపిక కాగా.. సిద్ధిపేట ఇందిరానగర్ జడ్పీహెచ్‌ఎస్‌ హెచ్ఎం నుంచి రామస్వామి ఎంపిక అయ్యారు. వీరిని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారు అభినందించారు. తన ఉపాధ్యాయ వృత్తిని సామాజిక సేవలో భాగంగా భావించి సేవలందించినందుకు దక్కిన గౌరవం అన్నారు. నిరుపేద విద్యార్థుల పట్ల చూపిన చొరవ సిద్దిపేట ఇందిరా నగర్ జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామస్వామి పనితీరుకు , సంకల్పానికి నిదర్శనం అని అన్నారు. పాఠశాల ఉపాధ్యాయుల సమిష్టి కృషి , ఐక్యత కు ఈ అవార్డు అని అన్నారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు.

Related posts