దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి వివాదాలను తెరపైకి తెచ్చాడు. మహానాయకుడు చిత్రంతో, లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ట్రైలర్ చూపిస్తా అంటున్నాడు. క్రిష్, బాలకృష్ణ కాంబినేషన్ లో ఎన్టీఆర్ బయోపిక్ తీస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా తీస్తున్న నేపథ్యంలో మొదటి భాగం సంక్రాంతి బరిలోదించారు. ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. ఇక ఎన్టీఆర్ మహానాయకుడు ఫిబ్రవరి 22 న రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. వర్మ తీస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై రక రకాలుగా ప్రమోషన్ చేస్తున్నారు.
మహానాయకడు రిలీజ్ డేట్ అనౌన్స్ చేయకముందే ఫిబ్రవరి 14న ఉదయం 9.27 గంటలకు జీవీ ఫిల్మ్స్ ట్రైలర్ విడుదల చేస్తుంది. తాజాగా మహానాయకుడు చిత్రాన్ని ఫిబ్రవరి 22న విడుదల చేస్తామని బాలయ్య అండ్ టీం ప్రకటించే సరికి, ఆ రోజు లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేయనున్నట్టు ట్వీట్లో తెలిపారు. ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాన్ని చూసేందుకు థియేటర్స్కి వచ్చే ప్రేక్షకులు లక్ష్మీస్ ఎన్టీఆర్ థియేట్రికల్ ట్రైలర్ కూడా చూడొచ్చంటూ మరో సంచలన ట్విట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.