telugu navyamedia
క్రీడలు వార్తలు

ముగిసిన రెండో రోజు.. 89 పరుగుల ఆధిక్యంలో భారత్…

మేతేరా వేదికగా భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న చివరి టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. అయితే నిన్న ఆట ముగిసే సమయానికి 24/1 తో ఉన్న భారత్ ఈరోజు ఆట ముగిసే సమయానికి 294/7 తో నిలిచింది. అయితే ఈ రోజు ఆట ప్రారంభమైన తర్వాత వరుస వికెట్లు కోల్పోతున్న భారత్ ను పంత్, సుందర్ కలిసి అందుకున్నారు. వీరిద్దరూ కలిసి 7 వ వికెట్ కు 113 పరుగుల భాగసౌమ్యని నెలకొల్పారు. ఈ క్రమంలోనే పంత్ తన 3 వ టెస్ట్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. కానీ ఆ తర్వాత వెంటనే ఔట్ అయ్యాడు. అయితే పంత్ పెవిలియన్ చేరుకున్న సుందర్ మాత్రం నిలకడగా రాణించాడు. అలాగే తన అర్ధశతకం కూడా పూర్తి చేసుకున్నాడు. కొత్తగా వచ్చిన అక్షర్ పటేల్ తో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ మరో వికెట్ పడకుండా చూసుకున్నాడు. దాంతో ఆట ముగిసే సమయానికి 89 పరుగుల ఆధిక్యం సంపాదించింది భారత్. ఇక ప్రస్తుతం సుందర్(60), అక్షర్(11) తో క్రీజులో ఉన్నారు. చూడాలి మరి రేపు ఏం జరుగుతుంది అనేది… అలాగే మన బ్యాట్స్మెన్స్ ఈ లిడ్ ను ఎంత వరకు తీసుకెళ్తారు అనేది.

Related posts