బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ ఇవాళ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. శనివారం రాత్రి ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో అడ్మిట్ అయిన కరీనా కపూర్ ఆదివారం మగ పిల్లాడిని ప్రసవించింది. అయితే.. ఈ విషయాన్ని రిద్ధిమా కపూర్ తన సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. దీంతో కరీనా ఫోటోలు కాస్త వైరల్ అయ్యాయి. కాగా.. చిన్నప్పటి గతేడాది ఆగస్టు 12 న కరీనా తను గర్భవతి అయిన విషయాన్ని అభిమానులకు వెల్లడించిన విషయం తెలిసిందే.. ఆ సమయంలో రెండో బిడ్డ రాక కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నామని సంతోషంగా చెప్పుకొచ్చింది. ఇక రెండోసారి కూడా కొడుకే పుట్టడంతో తైమూర్కు తమ్ముడొచ్చాడంటూ అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా.. 2012లో సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్లు పెళ్లి చేసుకున్న విషయం విదితమే.
previous post