telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు సామాజిక

పండగలంటే .. ప్రకృతితో కలిసి జీవించటమే.. : జనసేనాని

pavan kalyan on ycp and tdp

రాష్ట్ర ప్రజలకు జనసేనాని పవన్ కల్యాణ్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇది హిందువుల తొలి పండుగ అని, తలచిన పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలని ప్రార్థించే వేడుక అని తెలిపారు. పర్యావరణానికి హాని చేయకుండా పండుగ జరుపుకోవాలని పవన్ పిలుపునిచ్చారు.

నివాసాల్లోనూ, మంటపాల్లోనూ మట్టి విగ్రహాలనే వినియోగించాలని సూచించారు. గణనాథుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. వినాయకుడ్ని పూజించే ప్రతి ఒక్కరికీ తన తరఫున, జనసైనికుల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Related posts