చదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదరాబాద్ రేస్ క్లబ్ (రేస్ కోర్స్) లో విషాదం చోటు చేసుకుంది. 4వ గుర్రపు రేస్ జరుగుతుండగా జితేందర్ సింగ్ అనే జాకీ రేస్ లో గుర్రం పై నుండి పడ్డాడు. ఈ నేపథ్యంలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతన్ని హుటాహుటిన స్థానిక యశోద ఆసుపత్రికి తరలించారు. కానీ అతని పరిస్థితి విషమించడంతో జాకీ జితేందర్ సింగ్ {23} మృతి చెందాడు. జాకీ జితేందర్ సింగ్ రాజస్థాన్ కి చెందిన వాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని…జాకీ జితేందర్ సింగ్ మృతదేహాన్ని ఉస్మానియా మార్చరికి తరలించారు. ఇది ఇలా ఉండగా.. ఈ ఘటనను పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. దీనిపై కేసులు నమోదు చేసుకున్న పోలీసులు… ఈ ఘటనకు అసలు కారణాలు రాబట్టే పనిలో పడ్డారు. త్వరలోనే ఈ ఘటన పూర్తి వివరాలు బయట పెడతామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక జాకీ జితేందర్ సింగ్ మృతితో అతని కుటుంబం మొత్తం విషాదంలోకి వెళ్లిపోయింది.
previous post
next post