telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

హైదరాబాద్ రేస్ క్లబ్ లో విషాదం..

చదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదరాబాద్ రేస్ క్లబ్ (రేస్ కోర్స్) లో విషాదం చోటు చేసుకుంది. 4వ గుర్రపు రేస్ జరుగుతుండగా జితేందర్ సింగ్ అనే జాకీ రేస్ లో గుర్రం పై నుండి పడ్డాడు. ఈ నేపథ్యంలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతన్ని హుటాహుటిన స్థానిక యశోద ఆసుపత్రికి తరలించారు. కానీ అతని పరిస్థితి విషమించడంతో జాకీ జితేందర్ సింగ్ {23} మృతి చెందాడు. జాకీ జితేందర్ సింగ్ రాజస్థాన్ కి చెందిన వాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని…జాకీ జితేందర్ సింగ్ మృతదేహాన్ని ఉస్మానియా మార్చరికి తరలించారు. ఇది ఇలా ఉండగా.. ఈ ఘటనను పోలీసులు చాలా సీరియస్‌గా తీసుకున్నారు. దీనిపై కేసులు నమోదు చేసుకున్న పోలీసులు… ఈ ఘటనకు అసలు కారణాలు రాబట్టే పనిలో పడ్డారు. త్వరలోనే ఈ ఘటన పూర్తి వివరాలు బయట పెడతామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక జాకీ జితేందర్ సింగ్ మృతితో అతని కుటుంబం మొత్తం విషాదంలోకి వెళ్లిపోయింది.

Related posts