కర్ణాటక రాష్ట్రంలో మొత్తం 28 లోక్సభ స్థానాలకు జరిగిన ఎన్నికల కౌంటింగ్ ఈ రోజు ప్రారంభమైంది. 23 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. తాజా పరిణామాలు దేవెగౌడ కుటుంబ సభ్యులు చిక్కుల్లో పడిన సంకేతాలనిస్తున్నాయి. దేవెగౌడ స్వయంగా తుంకూరు నియోజకవర్గంలో వెనుకంజలో ఉన్నారు. సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమారస్వామి మాండ్య నియోజవర్గంలో వెనుకబడ్డారు. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న నటి సుమలత ముందంజలో ఉన్నారు.
కాగా, దేవెగౌడకు ఊరటనిస్తూ ఆయన మరో మనుమడు ప్రజ్వల్ రేవన్న ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దేవెగౌడ నియోజకవర్గమైన తుంకూరుతో సహా, బెంగళూరు నార్త్, బెంగళూరు సౌత్, ఉత్తర కన్నడలో బీడేపీ అభ్యర్థులు లీడింగ్లో ఉన్నారు. బీజేపీ అభ్యర్థిగా బెంగళూరు సౌత్ నుంచి తొలిసారి పోటీ చేస్తున్న తేజస్వి సూర్య సైతం ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
కొన్ని చానళ్లు అమ్ముడు పోయాయి: జగన్