ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ దూసుకుపోతోంది. ఇప్పటికే 145కుపైగా నియోజకవర్గాల్లో ముందంజలో ఉంది. తాజాగా నగరి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఆర్కే రోజా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రెండో రౌండ్ ముగిసేసరికి టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాశ్ పై రోజా 4,200 ఓట్ల ఆధిక్యంతో దూసుకుపోతున్నారు.
మరోవైపు విజయనగరంలోని కురుపాంలోని పాముల పుష్పవాణి లీడ్ లో ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం వైసీపీ 145 స్థానాల్లో లీడింగ్ లో ఉండగా, 29 స్థానాల్లో టీడీపీ అధిక్యంలో కొనసాగుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ప్రభావమే లేకుండా పోయింది. అలాగే జిల్లాలో పలు నియోజకవర్గాల్లో కూడా వైసీపీ ముందంజలో ఉంది.
బడ్జెట్ లో ఏపీకి అదనంగా ఇచ్చిందేమీ లేదు: విజయసాయి రెడ్డి