telugu navyamedia
ఆంధ్ర వార్తలు

మంత్రివర్గ ప్రక్షాళనకు ముహూర్తం:

  • ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కసరత్తు పూర్తి చేశారా?..ఈ నెలలోనే
  • పునర్వ్యవస్థీకరించదలచుకున్నారా?
  • కొత్త ముఖాలకు అవకాశం ఇచ్చేలా అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు.
  • వైఎస్ జగన్ తన కొత్త టీమ్‌ను ఏర్పాటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
  • ఈ నెలలోనే మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేస్తారనే ప్రచారం ఊపందుకుంది

అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రాజెక్టులను అంతే సమర్థవంతంగా జనంలోకి తీసుకెళ్లగలిగే వారికి మంత్రివర్గంలో తీసుకుంటారని చెబుతున్నారు.

రాయలసీమ, ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువ మందిని మంత్రివర్గంలోకి తీసుకునేలా జాబితాను సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు.

ఒకరిద్దరు సీనియర్లు మినహా దాదాపు మంత్రులందరినీ తొలగిస్తారనే ప్రచారం ఉంది.
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి ప్రమోషన్ ఇవ్వొచ్చనీ అంటున్నారు.

Related posts