telugu navyamedia
ఆంధ్ర వార్తలు

పెరుగుతున్న కరోనా కేసులు… సీఎంలతో మోడీ కీలక సమావేశం

  • ఈ సమావేశం నేడు మధ్యాహ్నం 12 గంటలకు వర్చువల్ గా జరగనున్నట్టు ప్రధాన మంత్రి కార్యాలయం వెల్లడించింది.
  • దేశంలో గత రెండు వారాలుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులను అంచనావేయడానికి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ నేడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.

ఈ సమావేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ దేశంలో కొవిడ్ పరిస్థితి, వ్యాక్సినేషన్ పరిధి, బూస్టర్ డ్రైవ్, పలు రాష్ట్రాల్లో నమోదవుతున్న కేసులపై వీడియో ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.

ఇటీవల ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలోనూ ప్రజలకు మోడీ కొవిడ్ జాగ్రత్తలు సూచించారు. కొవిడ్ నిబంధనలు పాటించాలని తెలిపారు. మాస్క్ లు ధరించాలని, పండుగ సీజన్ లో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేశారు.

ఈ సమావేశానికి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా ఆయా మంత్రిత్వ శాఖల అధికారులు హాజరయ్యే అవకాశం ఉంది.

Related posts