ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయడాన్నిసుప్రీంకోర్టు సమర్థించిన విషయం తెలిసిందే. ఈ విషయమై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు స్పందించారు. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని అన్నారు. ‘సుప్రీం’ తీర్పు వైసీపీకి చెంపపెట్టు లాంటిదని అన్నారు.
ఈ తీర్పుతో అయినా జగన్ తన మొండి వైఖరిని విడనాడాలని హితవు పలికారు. ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల సంఘం పరిధిలోనిదేనని స్పష్టం చేసిందని అన్నారు. సుప్రీంకోర్టు చెప్పిన విషయమైనా జగన్ కు అర్థమవుతుందా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తగు చర్యలు చేపట్టాలని యనమల డిమాండ్ చేశారు.