ఏపీలో ఈ రోజు కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి, కేసులు కాస్త ఉపశమనం కలిగించినా.. మరణాలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి.
ఈ రోజు ఎక్కువగా కడప జిల్లాలో కేసులు నమోదయ్యాయి. అక్కడ 1697మంది కరోనా బారినపడ్డారు.
ఈ రోజు 10వేలకు దిగాయి. గడిచిన 24 గంటల్లో 39,296 శాంపిల్స్ ని పరీక్షించగా 10,310 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది.
గత కొన్ని రోజులుగా 13 వేలకు పైగా నమోదైన కేసులు
తాజాగా కరోనా ధాటికి 12 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా కరోనా నుంచి 9,692 మంది కోలుకున్నారు. కడప, విశాఖపట్నం జిల్లాల్లో కరోనాతో ముగ్గురు చొప్పున మృతి చెందగా.. నెల్లూరులో ఇద్దరు, చిత్తూరు, గుంటూరు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.
తరువాత కర్నూలులో 1379, గుంటూరులో 1249, కృష్ణా 1008 మందికి ఈ మహమ్మారి సోకింది. ఇప్పటివరకు ఏపీలో 22,70,491 మంది కరోనా బారినపడ్డారు. ఇందులో 21,39,854 మంది రికవరీ అవ్వగా 14,606 మంది కరోనా కాటుకి బలయ్యారు.
చంద్రబాబుపై తమకు ఎలాంటి కక్ష లేదు: మంత్రి బొత్స