ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్విప్గా ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డిని నియమించారు. శ్రీకాంత్ రెడ్డి వైఎస్సార్సీపీ తరపున రాయచోటి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. చీఫ్విప్తో పాటు మరో ఐదుగురు విప్లను నియమించారు. మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి ముందే ప్రభుత్వ విప్ల జాబితాను ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈరోజు మధ్యాహ్నం 11.49 గంటలకు 25 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే.
మంత్రుల జాబితాలో చోటు దక్కని కొందరికి విప్ పదవులు వరించాయి. విప్లుగా పార్థసారథి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, బుడి ముత్యాల నాయుడు, దాడిశెట్టి రాజాను ఎంపిక చేశారు. అయితే శ్రీకాంత్ రెడ్డికి కేబినెట్లో స్థానం దక్కుతుందని అందరూ భావించినప్పటికీ సామాజిక వర్గాలకు సముచిత స్థానం కల్పించే ప్రయత్నాల్లో భాగంగా ఆయనకు మంత్రి పదవి దూరమైనట్లు తెలుస్తోంది.