వండిన కూర రుచిగా ఉండటం లేదని భర్త అన్నందుకు మనస్తాపానికి గురైన భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్ లోని కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో చోటుచేసుకుంది. కేపీహెచ్బీ నాలుగోఫేజ్ ఎల్ఐజీ వెంచర్-2లో బ్లాక్ నంబర్-6లోని ఫ్లాట్నంబర్ 401లో మనీష్, శారద దంపతులు నివసిస్తున్నారు.
శుక్రవారం రాత్రి శారద ఇంట్లో బెండకాయ కూర చేసింది. వాడిపోయిన బెండకాయలతో కూర చేశావంటూ భర్త మనీష్ చిరాకు పడడంతో తీవ్ర మనస్తాపానికి గురైన భార్య అర్ధరాత్రి తర్వాత గదిలోకి వెళ్లి ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త వచ్చి చూసేసరికి చీరతో ఉరేసుకుని కనిపించింది. అప్పటికే ఆమె ప్రాణాలు పోయాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తోంది: లక్ష్మణ్