మన్మథుడు సినిమా సీక్వెల్ తో గత ఏడాది వచ్చిన కింగ్ నాగార్జున అభిమానులను నిరాశపరిచాడు. అయితే ప్రస్తుతం నాగ్ అహిషోర్ సాల్మోన్ దర్శకత్వం లో ‘వైల్డ్ డాగ్’ అనే సినిమాలో చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా లాక్డౌన్ తరువాత నాగార్జున సినిమాల విషయంలో ఎంతో దూకుడు చూపించారు. తను చేస్తున్న షోలను, సినిమా షూటింగ్లను చకచకా పూర్తి చేశారు. అయితే నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించుకొన్నా విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా ముందుగా అనుకున్నట్లు ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్లో కాకుండా నేరుగా థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. అయితే లాక్ డౌన్ లో బంద్ అయిన థియేటర్లు మళ్ళీ గత ఏడాది డిసెంబర్ 25న సాయి ధరమ్ తేజ్ సినిమాతో తెరుచుకున్నాయి. అప్పటినుండి వరుస సినిమాలు విడుదల అవుతూ విజయాన్ని సాధిస్తుండటంతో ఏప్రిల్ 2న ఈ సినిమాను నేరుగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు తాజాగా చిత్రబృందం ప్రకటించింది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో నాగార్జున ఎన్ఐఏ ఏజెంట్గా కనిపిస్తున్నారు. ఇందులో దియా మీర్జా, సయామీ ఖేర్లు నటించగా, మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
previous post
next post
ఏపీలో ప్రతీకార రాజకీయాలు.. చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు