telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సుజిత్ మృతికి విశాల్ సంతాపం

Sujith

ఈ నెల 25న సుజీత్ అనే రెండేళ్ళ‌ చిన్నారి బోరుబావిలో పడిన సంగ‌తి తెలిసిందే. తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లా నడుకట్టుపట్టి గ్రామంలో నాలుగు రోజుల క్రితం (శుక్రవారం సాయంత్రం) బోరుబావిలో పడిపోయిన చిన్నారి సుజిత్ విల్సన్‌ను రక్షించే ప్రయత్నాలు సోమవారం కూడా కొనసాగాయి. సుమారు 88 అడుగుల లోతున గల బావిలో పడిపోయిన సుజిత్‌ను వెలికి తీసేందుకు అధికారులు ఎంత‌గానో ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికి, ఫ‌లితం లేకుండా పోయింది. మంగళవారం తెల్లవారుజామున సుజిత్ మృతదేహాన్ని వెలికితీశారు. బాలుడు సుజిత్ మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. సుజిత్ క్షేమంగా బ‌య‌ట‌కి రావాల‌ని ఎంద‌రో ప్రార్ధ‌న‌లు చేశారు. కొంద‌రు సినీ సెల‌బ్రిటీలు కూడా సుజిత్ క్షేమంగా వ‌స్తాడ‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. బోరుబావులను తెరిచి ఉంచడం నేరంగా పరిగణించాలని నటుడు కమల్‌హసన్ పేర్కొన్నారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ తదితరులు సురక్షితంగా ఆ బాలుడు బయటకు రావాలని ఆకాంక్షిస్తూ ప్రార్థనలు చేసినట్లు ట్వీట్లు చేశారు. కాని సుజిత్ చ‌నిపోయాడ‌ని తెలిసి ఎంతో ఆవేద‌న‌కి గుర‌వుతున్నారు. తాజాగా త‌మిళ న‌టుడు విశాల్.. సుజిత్ మృతికి సంతాపం తెలిపారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు మ‌రోసారి జ‌ర‌గ‌కుండా గ‌ట్టి చ‌ర్యలు తీసుకోవాల‌ని విశాల్ త‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు.

Related posts