ప్రముఖ పాత్రికేయులు, విశాలాంధ్ర మాజీ ఎడిటర్ చక్రవర్తుల రాఘవాచారి కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాఘవాచారి హైదరాబాద్లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మరణించారు. ఆయన మృతిపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
నిబద్ధత కలిగిన జర్నలిస్ట్గా, సామాజిక కార్యకర్తగా రాఘవాచారి జీవితం ఆదర్శప్రాయమని కేసీఆర్ పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రాఘవాచారి కుటుంబ సభ్యులకు జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. జర్నలిజం వృత్తిలో విలువల కోసం ఆయన కృషి చేశారని అన్నారు. రాబోయే తరాలకు రాఘవాచారి రచనలు స్ఫుర్తిదాయకమన్నారు. తెలుగు జర్నలిజంలో రాఘవాచారి చేసిన సేవలు ఎనలేనివని జగన్ కొనియాడారు.
టీపీసీసీ పదవిపై నాకు ఆసక్తి లేదు: వెంకటరెడ్డి