telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ప్రజలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: తలసాని

Talasani Trs

ప్రజలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్ మండల కార్యాలయంలో లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని సీఎంకేసీఆర్ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు.

పేదింటి ఆడపడుచుల వివాహానికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ క్రింద లక్ష 1116 రూపాయల ఆర్ధిక సహాయం అందించి ప్రభుత్వం అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. వృద్దులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులకు ఆసరా పెన్సన్ లు అందిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని రకాల సౌకర్యాలను కల్పించి కార్పోరేట్ ఆసుపత్రులకు దీటుగా మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నట్లు చెప్పారు.

Related posts