పశ్చిమ బెంగాల్ రాజకీయాలు రోజు రోజుకు వేడేక్కుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రాకముందే..కీలక నేతలు తృణమూల్ కాంగ్రెస్ షాక్ ఇచ్చారు. షెడ్యూల్ వచ్చాక కూడా బీజేపీలో తీర్థం తీసుకుంటున్నారు. తృణమూల్ కాంగ్రెస్ను దెబ్బతిసే విధంగా బీజేపీ పార్టీ ఉన్న అవకాశాలన్నింటిని చక్కగా వాడేస్తున్నది. తమతో వచ్చే వారు ఎవరైనా ఓకే అంటూ పార్టీ కండువా కప్పేస్తోంది బీజేపీ. ఈ క్రమంలోనే బెంగాలీ సినీ తార స్రబంతి ఛటర్జీ బీజేపీలో చేరారు. తన అందచందాలతో బెంగాల్ ప్రజలను సమ్మోహితులను చేసిన స్రబంతి కోల్కతాలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాస్ విజయ్ వర్గియా, బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ సమక్షంలో స్రబంతి పార్టీలో చేరారు. స్రబంతి ఛటర్జీని పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు బీజేపీ పేర్కొంది. కాగా.. పశ్చిమ బెంగాల్లో ఎనిమిది విడతల్లో ఎన్నికల పోలింగ్ జరుగనుంది. మార్చి 27 తొలి విడత, ఏప్రిల్ 1న రెండో విడత, ఏప్రిల్ 6న మూడో విడత, ఏప్రిల్ 10న నాల్గో విడత, ఏప్రిల్ 17న ఐదో విడత, ఏప్రిల్ 22న ఆరో విడత, ఏప్రిల్ 26న ఏడో విడత, ఏప్రిల్ 29న ఎనిమిదో విడత పోలింగ్ నిర్వహించనుంది ఎన్నికల సంఘం.
previous post
next post