telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సబ్సిడీపై ఉల్లిపాయలు అందించాలి: వీహెచ్

hanmanth rao congress

దేశంలో ఉల్లిపాయల ధరలు చుక్కలనంటిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు స్పందించారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ఉల్లి ధరలు తగ్గించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఏపీలో మాదిరి తెలంగాణలోనూ సబ్సిడీపై ఉల్లిపాయలు అందించాలని వీహెచ్ డిమాండ్ చేశారు.

హైదరాబాద్ లో టీ-కాంగ్రెస్ పార్టీ మరో సీనియర్ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ నేరం చేయాలంటే భయపడేలా చట్టాల్లో మార్పులు తేవాలని టీ-కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క కోరారు. విచ్చలవిడిగా మద్యం అమ్మకాల వల్లే మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని అన్నారు. మద్యం అమ్మకాల ద్వారా ఆదాయం పెంచుకోవాలనే ఆలోచన నుంచి సీఎం కేసీఆర్ బయటకు రావాలని కోరారు.

Related posts